Tharman: దేశంలో కరోనా మరో సారి విజృంభణ కొనసాగిస్తోంది. అనేక మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ కరోనా బారిన పడ్డారు. పలు జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ తనకు కరోనా సోకిందని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనబడటంతో పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యిందని చెప్పారు. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్ అయినట్లు వెల్లడించారు. తనతో ఇటీవల కాంటాక్ట్ అయిన వారు టెస్ట్ లు చేయించుకోవాలని సూచించారు.
తమన్ త్వరగా కోలుకోవాలని పలువురు సెలబ్రిటీలు ట్వీట్ చేస్తున్నారు. భీమ్లానాయక్, సర్కార్ వారి పాట లాంటి సినిమాలతో బిజీగా ఉన్న తమన్ చేతిలో ప్రస్తుతం పదికిపైగా సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా రాథేశ్యామ్ లాంటి పాన్ ఇండియా మువీకి, పలు చిన్న సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ ప్రముఖుల్లో మహేష్ బాబు, మంచు లక్ష్మి, విశ్వక్ సేన్ తదితరులు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి హోం క్వారంటైన్ లో ఉన్నారు.