Ram charan: ప్రస్తుతం టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థలతో పోటీ మరీ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తోంది సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్. ప్రస్తుతం ఈ బ్యానర్ పేరు కూడా పెద్ద బ్యానర్ల జాబితాలో ఉంది. ఈ బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్స్ సాధిస్తున్నాయి. హీరోలు కూడా ఈ సంస్థను లక్కీగా భావిస్తున్నారు. ఇక సంస్థ హారిక అండ్ హాసిని అనుబంధ సంస్థ అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అందుకే ఈ బ్యానర్ నిర్మిస్తున్న సినిమాలలో కూడా త్రివిక్రమ్ ప్రమేయం పూర్తిగా ఉంటుంది.
ఇక నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ..ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మా సంస్థపై నిర్మితమయ్యే సినిమాల స్క్రిప్ట్ విషయంలో తప్పకుండా త్రివిక్రమ్ గారి పర్యవేక్షణ ఉంటుంది అన్నారు. ఆయన సలహాలు .. సూచనలతోనే మేము ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
Ram charan: చరణ్ హీరోగా నిర్మించే సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం
ఇక మా సంస్థలో పవన్ కళ్యాణ్ గారితో ‘భీమ్లా నాయక్’ చేయడంలోను త్రివిక్రమ్ గారి పాత్ర చాలా ఉంది. అంతేకాదు, పవన్ కళ్యాణ్ హీరోగా మరో సినిమాను కూడా చేయాలని ఉంది. అది ఎప్పటికి వర్కౌట్ అవుతుందనేది మేమూ చాలా ఆతృతగా చూస్తున్నాము అని చెలిపారు. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్ లతోను సితార సంస్థలో సినిమాలు చేయాలనుకుంటున్న విషయాన్ని నాగవంశీ బయటపెట్టారు. అంతేకాదు, చరణ్ హీరోగా నిర్మించే సినిమాకు కూడా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు