SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కొద్ది నెలల క్రితం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయింది. రెండో షెడ్యూల్ స్టార్ట్ కావలసిన సమయంలో.. సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతోపాటు హీరోయిన్ పూజ హెగ్డే కాలికి గాయం కావడంతో వాయిదా పడటం జరిగింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో సింగర్ సునీత కీలక పాత్ర చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో మహేష్ బాబు అక్కగా సింగర్ సునీత కనిపించనున్నట్లు సమాచారం. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలలో ఈ రీతిగానే పాత్రలు స్క్రిప్టులో పొందుపరచడం జరిగింది. సన్నాఫ్ సత్యమూర్తి లో.. స్నేహ, అలా వైకుంఠపురం లో..టబూ, అత్తారింటికి దారేదిలో నదియా.. నటించారు. కాగా ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో సింగర్ సునీతనీ త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం సినిమాకి సంబంధించి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వటానికి టైం పట్టే అవకాశం ఉండటంతో… ఏప్రిల్ నెలలో విడుదల కావలసిన ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరూ కాంబినేషన్ లో అతడు, ఖలేజా రెండు సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలలో చాలా విభిన్నంగా మహేష్ బాబు పాత్రని త్రివిక్రమ్ తీర్చిదిద్దడం జరిగింది. దీంతో వస్తున్న ఈ మూడు సినిమాలో మహేష్ నీ త్రివిక్రమ్ ఏవిధంగా చూపించబోతున్నాడో అనేది ఆసక్తికరంగా మారింది.