బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి కరోనా పాజిటివ్ వార్త రాగానే యావత్ దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ వార్త వచ్చిన కొద్ది గంటల్లోనే కోడలు ఐశ్వర్యరాయ్ కి కొడుకు అభిషేక్ బచ్చన్ కి మనవరాలు ఆరాధ్యకి కూడా కరోనా అని తేలడంతో ఆయన అభిమానులతో పాటు చాలా మంది కంగారు పడ్డారు.
కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే అమితాబ్ నానావతి ఆసుపత్రికి చేరగా తర్వాత కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ మనవరాలు ఆరాధ్య కూడా అక్కడే ట్రీట్ మెంట్ తీసుకున్నారు. కరోనా వచ్చినా గానీ వెంటనే ఏమి కంగారు పడకుండా చాలా ధైర్యంగా అమితాబచ్చన్ వ్యవహరించి వైద్యులకు సెల్యూట్ చేస్తూ అప్పట్లో వీడియో కూడా విడుదల చేయగా అది వైరల్ అయింది.
ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ ఎనిమిది పదుల వయస్సు కావడంతో పాటు మనవరాలు వయసు చిన్న వయసు అవ్వటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తూ ఎప్పటికప్పుడు వారికి ధైర్యం చెప్పారు.ఈ విధంగా నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా తరుణంలో మొదటిగా ఐశ్వర్యరాయి ఆ తర్వాత మనవరాలు ఆరాధ్య కరోనా నుండి కొలుకోగా తాజాగా అమితాబ్ బచ్చన్ కరోనా పై విజయం సాధించారు.
దీంతో బచ్చన్ ఫ్యామిలీ కొడుకు మినహా మిగతా వారంతా కరోనాపై విక్టరీ సాధించినట్లు అయింది. త్వరలోనే తాను కూడా మహమ్మారిని జయిస్తాను అని అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా తన తండ్రి మరియు తన కుటుంబం కోసం భగవంతునికి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ అభిషేక్ బచ్చన్ ట్విటర్లో పోస్ట్ పెట్టడం జరిగింది.