సుకుమార్ అల్లు అర్జున్ ల కాంబోలో రూపొందుతున్న తాజా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ హ్యాట్రిక్ సినిమాని 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపుందుతుంన్న పుష్ప నుండి ఇప్పటికే 5 భాషలకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కే పుష్ప లాక్ డౌన్ కి ముందే షెడ్యూన్ ని పూర్తి చేశారు. ఆ తర్వాత షెడ్యూల్ ని కేరళ అడవుల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేసి డ్రాపయ్యారు. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా చిత్ర పరిశ్రమలో సినిమాల షూటింగ్స్ అన్ని నిలిచిపోగా ఇటీవల ప్రభూత్వం షూటింగ్స్ అనుమతి ఇచ్చింది. నేపథ్యంలో పుష్ప సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని సుకుమార్ సిద్దమవుతున్నాడట.
జూలై ఆఖరి వారం నుండి షెడ్యూల్ ప్లాన్ చేశారని విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం. ముందుగా తక్కువ మంది ఆర్టిస్టులు ఉండే సీన్స్ ని తెరకెక్కించేలా సుకుమార్ ప్రిపేర్ అయ్యాడట. ఇక ఫారెస్ట్ లో తీయాల్సిన భారీ షెడ్యూల్ మాత్రం ఇప్పట్లో ఉండదని అంటున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో ఐటం సాంగ్ కోసం ఊర్వశీ రౌతెలా పేరు అలాగే దిశా పఠాని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక పుష్ప లో మరో హీరోయిన్ కి అవకాశం ఉంది. కాని ఎవరిని ఫైనల్ చేస్తారో ఇంకా తెలియలేదు.