Samantha: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా రాబోతుండగా.. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` పేరుతో గత ఏడాది విడుదలై భారీ విజయం సాధించింది.
బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం మ్యూజికల్గా కూడా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత ఇందులో చేసిన `ఊ అంటావా మావా ఊఊ అంటావా` ఐటెం సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపేంది. ఈ సాంగ్ తర్వాత సమంత క్రేజ్ మరోస్థాయికి చేరుకుంది. అయితే పుష్ప పార్ట్ 2లో మాత్రం ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ సమంతకు ఇచ్చేదేలే అంటున్నాడు సుకుమార్.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `పుష్ప ది రూల్` పేరుతో పార్ట్ 2 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అందుకు అన్ని పనులు చకా చకా జరుగుతున్నాయి. ఇక పుష్ప2లో కూడా ఐటెంట సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి సమంత ప్లేస్ను బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ రీప్లేస్ చేయనుందని అంటున్నారు.
ఇప్పటికే సుకుమార్ దిశా పటానీ సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. కాగా, ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.