ప్రస్తుతం మహేష్ బాబు 25వ సినిమా మహార్షి మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రిన్స్ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే వచ్చిన రంగస్థలంతో బిగ్ బ్లాక్ బస్టర్తో ఫుల్ స్వింగ్లో ఉన్న సుకుమార్, మహేశ్ని కూడా వైవిధ్యమైన కథతో ప్రజెంట్ చేస్తాడని తెలుస్తోంది. ఇంతకుముందు ఈ కాంబోలో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమా డిఫరెంట్ స్టోరీతో హాలీవుడ్ స్టాయిలో ఉన్నప్పటికి ఆడియన్స్కు మాత్రం కనెక్ట్ కాలేకపోయింది.
వన్ నేనొక్కడినే సినిమాతో మహేష్ ఇచ్చిన ఆఫర్ని కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోయిన సుకుమార్, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మాత్రం 100 పర్సంట్ వాడుకుని, మంచి హిట్ కొడతానని చాలా కన్ఫిడెంట్ గా ఉన్నాడు. పైగా రంగస్థలంతో మంచి హిట్ అందుకున్నాడు కాబట్టి, ఈ కాంబోలో వచ్చే సినిమాపై ఇప్పటి నుండే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అవుతుంది. దానికి తగ్గట్లుగానే కథను, క్యాస్ట్ అండ్ కౄతో పాటు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ కోసం భారీగానే ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.
ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ కు ఈక్వెల్గా ఓ స్ట్రాంగ్ క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నాడని తెలుస్తోంది.. ఆ క్యారెక్టర్కు ప్రభాస్ అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట సుకుమార్. ఒకవేళ ప్రభాస్కు కుదరకపోతే, యంగ్ టైగర్తో ఎన్టీఆర్, రామ్ చరణ్లలో ఒకరిని ఒప్పించాలనుకుంటున్నాడట. ఆల్రెడీ తారక్కు నాన్నకు ప్రేమతో, చరణ్కు రంగస్థలం సినిమాలతో మెమరబుల్ హిట్ ఇచ్చాడు సుకుమార్.. ఆ రిలేషన్కు తోడు ఈ హీరోలిద్దరూ కూడా మహేష్కు మంచి ఫ్రెండ్స్. అయితే రాజమౌళి మల్టీస్టారర్ మూవీకి మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తాడని టాక్ కూడా టాలీవుడ్లో వినిపిస్తోంది. సో దీని ప్రకారం చూస్తే మహేష్ ,సుకుమార్ సినిమాకు తారక్గాని, చెర్రీగాని ఈజీగానే ఒప్పుకుంటారు.. ఇక ప్రస్తుతం మహేష్ చేస్తున్న మహర్షి మూవీ కంప్లీట్ కాగానే ఈ సినిమా లాంచింగ్ వచ్చే ఏడాదిలో ఉంటుందని తెలుస్తోంది.