Pushpa 2: “పుష్ప” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా దేశంలో విదేశాలలో కూడా ఊహించని రీతిలో విజయం సాధించింది. ప్రమోషన్ కార్యక్రమాలు ఒక్క తెలుగులో చేపట్టిన మిగతా చోట్ల సరిగ్గా చేయకపోయినా గాని రికార్డు స్థాయి కలెక్షన్లు “పుష్ప” సాధించడంతో “బాహుబలి” తర్వాత తెలుగు సినిమా సత్తా ఏంటో “పుష్ప” రుజువు చేసినట్లయింది. ఏ స్థాయిలో విజయం సాధించింది అంటే…. దేశ విదేశాలలో ఉండే చాలామంది “పుష్ప” డైలాగులు మరియు పాటలకు సోషల్ మీడియాలో చిందులు వేశారు.
సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. ఎంతో ఘన విజయం సాధించిన ఈ సినిమా .. ఇప్పుడు సెకండ్ పార్ట్ చిత్రీకరణ జరుపుకోవడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్.. స్టోరీలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసినట్లు కొత్త పాత్రలు కూడా చేర్చినట్లు ఇటీవల వార్తలు రావడం మనం విన్నాం. ఇక ఇదే సమయంలో తన ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సుకుమార్ .. రెండో భాగంలో కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టాక్.
“ఊ అంటావా… ఉఉ అంటావా” అనే సాంగ్ పార్ట్ వన్ లో. రాగా సమంతా..బన్నీతో చిందులు వేసింది. కాక ఇప్పుడు పుష్ప రెండోభాగంలో.. మరో మసాలా సాంగ్ ఇవ్వటానికి దేవిశ్రీప్రసాద్ రెడీ అయినట్లు ఇప్పటికే ట్యూన్స్ కూడా సెట్ చేసినట్లు.. దీనిలో భాగంగా ఈ సాంగ్ కి స్టార్ హీరోయిన్ దిశా పటాని చేత స్టెప్పులు వేయించనున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇక ఇదే రీతిలో ఐకాన్ స్టార్ బన్నీ… కూడా అదిరిపోయే స్టెప్పులు ఈ సాంగ్ కి పడేలా.. డాన్స్ పరంగా ఇతర ఇండస్ట్రీలో కూడా సత్తా చాటేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.