“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి అన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదల నేపథ్యంలో ఒకపక్క ఇంటర్వ్యూలు ఇస్తే మరోపక్క అనేక కార్యక్రమాలు “లైగర్” టీమ్ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా తాజాగా యాంకర్ సుమకి.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో పాటు హీరో హీరోయిన్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే.. చార్మితో పాటు విలన్ ఆదర్శ్ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో సినిమా యూనిట్ నార్త్ మొదలుకొని సౌత్ వరకు ఎక్కడికి వెళ్ళినా జనం బాగా రావడం పై మీ స్పందన ఏంటి అని సుమా ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో అసలు ఉత్తరాదిలో అంత మంది జనాలు వస్తారని ఊహించలేదు. అసలు నేను వస్తే జనాలు నన్ను చూస్తారా అని విజయ్ దేవరకొండ నన్ను అడిగేవాడు అంటూ ఛార్మి చెప్పుకొచ్చింది.
కానీ ఊహించని విధంగా 5000 మంది అనుకుంటే దానికి త్రిబుల్ గా 25,000 మంది వచ్చేవాళ్ళు దీంతో కొన్నిచోట్ల మధ్యలోనే ప్రమోషన్ కార్యక్రమం ఆపేసి వెనక్కి వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. మధ్యలో విజయ్ దేవరకొండ కలగజేసుకుని ఈవెంట్ లో డాన్స్ వేయమనే వాళ్ళు కానీ మధ్యలోనే ఈవెంట్ ఆగిపోవడంతో నాకు కొంత శ్రమ తగ్గేది. నాకు డాన్స్ అంటే చాలా చిరాకు..అని అన్నారు. ఇక ఇదే సందర్భంలో ఒకానొక టైంలో ఈ రీతిగానే నాకు కూడా పరిస్థితి ఎదురయింది అని సుమ మాట్లాడుతుండగా వెంటనే పూరి కలుగజేసుకుని ఎన్టీఆర్ “ఆంధ్రావాలా” సినిమా ఆడియో ఫంక్షన్ కి సుమా నీ యాంకర్ గా మాట్లాడుకోవడం జరిగింది.
ఆ సమయంలో నాలుగు స్పెషల్ ట్రైన్ లు.. అభిమానుల కోసం వేయటంతో దాదాపు 5 లక్షల మంది దాక వచ్చారు. ఆ జనం చూసి సుమా కంగారు పడిపోయి మధ్యలోనే దండం పెట్టి వెళ్ళిపోయింది..అని పూరి జగన్నాథ్ కొత్త విషయాన్ని బయట పెట్టారు. 2004వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన “ఆంధ్రావాలా” అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ సీనియర్ ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులో నిర్వహించగా ఆ టైంలో భారీ ఎత్తున జనాలు వచ్చారు. తెలుగు సినిమా రంగంలోనే అత్యంత భారీగా “ఆంధ్రావాలా” ఆడియో ఫంక్షన్ జరిగింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!