టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించనున్నాడు. వివరాల్లోకెళ్తే.. సందీప్కిషన్ తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడే. అయితే త్వరలోనే బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నాడు. అయితే సినిమాల ద్వారా కాదు.. వెబ్ సిరీస్ రూపంలో. మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్`. సెప్టెంబర్ 20 నుండి ఈ వెబ్ సిరీస్ ప్రసారం అవుతుంది. రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె ఈ వెబ్సిరీస్ను డైరెక్ట్ చేశారు. ఈ స్పై థ్రిల్లర్లో అతిథి పాత్రలో ఆర్మీ ఆఫీసర్గా సందీప్ కిషన్ కనిపించబోతున్నారు. 14 రోజుల పాటు ఈ పాత్రను కాశ్మీర్లో చిత్రీకరించారు. ఈ పాత్రను చేసేటప్పుడు ఆర్మీ ఆపరేషన్స్ సమయంలో కమెండోలు ఎలా బిహేవ్ చేస్తారనే దానిపై సందీప్ కాస్త రీసెర్చ్ కూడా చేసి పాత్రలో నటించాడు.
previous post
next post