సూపర్ స్టార్ మహేశ్ బాబు భరత్ అనే నేను తర్వాత చేస్తున్న సినిమా ‘మహర్షి’ . మహేశ్ 25వ చిత్రం కావడంతో మహర్షిపై ప్రిన్స్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాటిని మించే బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న మహర్షి మౌనం వీడీ, మాట్లాడడం మొదలుపెట్టాడు. మహర్షి మౌనం వీడడం ఏంటా అనుకుంటున్నారా? ఏమీ లేదండీ మహేశ్ మహర్షి సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.
ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో నిర్మాత దిల్ రాజు దర్శకుడు, వంశీ పైడిపల్లి అల్లరి నరేష్ తో పాటు టీం సభ్యులు పాల్గొన్నారు. దిల్ రాజు మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా బయటకి వచ్చిన ఈ పూజ కార్యక్రమానికి చెందిన ఫొటోస్ ని రిలీజ్ చేశాడు. ఎప్పటి నుంచో మహర్షి అప్డేట్ కోసం ఎదురు చూసిన ఘట్టమనేని అభిమానులు ఈ ఫొటోస్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఖుషీగా ఉన్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!