Mahesh: సూపర్ స్టార్ ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అవును..చాలా రోజుల నుంచి మహేశ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందో అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ అప్డేట్ను తాజాగా ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్ పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్కు వచ్చాక ఆగిపోయింది.
అందుకు కారణం మహేశ్ బాబు కాలికి సర్జరీ జరగడంతో పాటు కోవిడ్ కూడా సోకింది. ఇక ఇదే సమయంలో మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ ఇప్పుడప్పుడే సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారా..అని అందరూ అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ను మేకర్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. కాగా, మహేశ్ ప్రస్తుతం కోలుకొని షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.
Mahesh: ఏప్రిల్ 1న భారీ స్థాయిలో రిలీజ్..
ఫిబ్రవరి మొదటి వారం నుంచి మహేశ్ బాబు సర్కారు వారి పాట చిత్రీకరణలో పాల్గొనబోతున్నారట. మార్చ్ నెలలో ఈ మూవీ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని పక్కా ప్లాన్తో షెడ్యూల్ వేశారట దర్శకుడు పరశురామ్. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఈ మూవీ టీజర్కు ఇచ్చిన బీజీఎం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సర్కారు వారి పాట సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని థమన్ అఫీషియల్గా వెల్లడించారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 1న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్తో పాటు మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి.