Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పరంగా తిరుగులేని హీరో అని అందరికీ తెలుసు. ఇక వ్యాపార పరంగా కూడా గత కొద్ది సంవత్సరాలు నుండి భార్య నమ్రతతో కలసి చేస్తున్న ఆలోచనలు సక్సెస్ అవుతున్నాయి. ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్ లతో రానిస్తున్న మహేష్ బాబు తాజాగా హోటల్ ఫీల్డ్ లోకి కూడా అడుగు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో తన భార్య నమ్రత పేరుతో హైదరాబాద్ లో రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ఈరోజు ఉదయం 7గంటలకు ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ అయింది.
ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో తీర్చిదిద్దిన ఈ రెస్టారెంట్ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని… టిఆర్ఎస్ భవనం పక్కన ఉంది. ఈ క్రమంలో నమ్రత టిఫిన్ చేసినా అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఇటువంటి హోటల్ పెట్టడం తమ మామ సూపర్ స్టార్ కృష్ణ యొక్క కోరిక అని తెలియజేశారు. మొత్తం వెజిటేరియన్ కలిగిన రెస్టారెంట్ అని స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో తనకి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుకి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. ఏషియన్ గ్రూప్ సంస్థతో కలసి మహేష్ ఈ రెస్టారెంట్ వ్యాపారంలో భాగం కావడం జరిగింది. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయింది.
సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టే టైములో సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఆగిపోయింది. కాగా త్వరలోనే మళ్లీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్నాడు. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు… అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా వస్తున్నా ఈ మూడో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. కానీ తాజా పరిస్థితులు బట్టి చూస్తే…సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.