దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుత చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్`కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. దివంగత నేత సీనియర్ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంట్రీ తర్వాత రాజకీయ కోణాలను ఆవిష్కరిస్తూ .. ఆయన రూపొందించిన చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్`. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈ సినిమాను విడుదల చేయరాదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్టేను ఎత్తివేయాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డి సుప్రీం కోర్టు పిటిషన్ వేశారు. భారత అత్యుత్తన్నత న్యాయస్థానం అయినా తమ సినిమాను త్వరగా విడుదల చేయమని హైకోర్టుని ఆదేశిస్తుందని భావించిన యూనిట్కి సుప్రీం కోర్టు షాకిచ్చినట్లు తెలుస్తుంది. సుప్రీం జస్టిస్ రంజన్ గొగొయ్ .. హై కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంలో తొందరెందుకని ? నిర్మాతను గట్టిగానే ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తులు సినిమా చూసి.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..
previous post
next post