తెలుగు సినిమా రంగంలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరు సురేఖ వాణి. ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చిన ఇట్టే ఒదిగిపోతుంది. ఇక వాస్తవ జీవితం లోకి వచ్చేసరికి సురేఖ వాణి వెండి తెరపై ఎంత ఎనర్జిటిక్ గా ఉంటుందో బయట కూడా అదే రీతిలో చాలా చలాకీగా వ్యవహరిస్తూ ఉంటుంది. కూతురు సుప్రీత తో సోషల్ మీడియా లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ రచ్చ రచ్చ చేస్తుంటది. సురేఖ వాణి ఇచ్చే ఫోజులు కుర్రకారు మైండ్ బ్లాక్ అయ్యే రీతిలో ఉంటాయి. దీంతో సురేఖ వాణి వీడియోలు ఫోటోలు ఓరేంజ్ లో వెబ్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
అప్పట్లో టిక్ టాక్ యాప్ లో ఈ తల్లీకూతుళ్లు చేసిన వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చేవి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ తల్లీకూతుళ్లు రాజస్థాన్ లో షూటింగ్ నిమిత్తం తెగ హడావిడి చేస్తున్నారు. విజయ్ సేతుపతి, రాధిక రాజేంద్ర ప్రసాద్ వంటి తారాగణంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ జైపూర్ లో జరుగుతోంది. దీంతో ఈ షూటింగ్ కోసం తనతోపాటు కూతుర్ని తీసుకెళ్ళింది సురేఖవాణి. షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ వస్తే చాలు ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ చెలరేగిపోతున్నారట. చుట్టుప్రక్కల ప్రదేశాలలో చక్కర్లు కొడుతున్నారట. రాజస్థాన్ లో ఉండే ప్రముఖ ప్రదేశాలలో ఈ తల్లి కూతుర్లు ఇద్దరు విహారయాత్రలు చేస్తున్నారట.
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో షూటింగ్ గ్యాప్ లో సురేఖవాణి ఆవిరి పీల్చుకుంటూ బిజీబిజీగా గడిపేస్తున్నారు అని ఫిలిం నగర్ టాక్. అంతే కాకుండా ఇద్దరు కలిసి అక్కడ అజ్మీర్ దర్గాను దర్శించుకున్నారు. మొత్తానికి సురేఖవాణి ఒకపక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క కరోనా సోకకుండా బానే జాగ్రత్తలు తీసుకుంటుంది…అని సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తలపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.