“వకీల్ సాబ్” సినిమాతో ఇండస్ట్రీ లోకి రి ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టడం తెలిసిందే. 2018 లో “అజ్ఞాతవాసి” సినిమా చేసి పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి మెగా ఫ్యాన్స్ కి దూరమైన పవన్ రాజకీయాల్లో బిజీ బిజీగా గడిపారు. 2019 ఎన్నికలలో పోటీ చేసిన పవన్ ఓడిపోవడంతో ప్రస్తుతం మళ్లీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు. అయితే మధ్యలో వచ్చిన గ్యాప్ ఫిల్ చేయటానికి మెగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టే రీతిలో పవన్ ఇప్పుడు సినిమాలు లైన్ లో పెట్టడం తెలిసిందే.
“వకీల్ సాబ్” సినిమా తర్వాత క్రిష్, హరీష్ శంకర్ సినిమాలు చేస్తున్న పవన్ ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా ఒప్పుకున్నట్లు వార్తలు ఇటీవల రావడం జరిగాయి. ఈ సినిమాని రామ్ తాలూరి నిర్మిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం సురేందర్ రెడ్డి “ఫిదా” బ్యూటీ సాయి పల్లవి ని హీరోయిన్ గా తీసుకున్నట్లు లేటెస్ట్ గా వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వినిపించినట్లు అంతా ఓకే అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ సినిమాని వచ్చే ఏడాది మధ్యలో స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్.