చంద్రముఖి లాంటి సినిమాలతో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ జ్యోతిక. అటూ తమిళ్ ఇటూ తెలుగు సినిమాలతో స్టార్ గా రాణిస్తున్న హీరో సూర్య. ఈ కోలీవుడ్ స్టార్ కపుల్ 2006 లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లికి ముందు తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్న జ్యోతిక.. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఒక్కప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ అమ్మడు ఎందుకు సినిమాలకు దూరం అయిందో తెలియదు.
కానీ మళ్లీ ఈ మధ్య సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తన అభిమానులను అలరిస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ చంద్రముఖి రీ ఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకులు తనను అభిమానిస్తున్నే ఉన్నారు. ఈ మధ్య వచ్చిన బంగారు తల్లి, మగువలు మాత్రమే అనే సినిమాలు ఓటీటీలో మంచి టాక్ ను సంపాదించాయి.
అయితే ఈ జంట పెళ్లికి ముందు పలు సినిమాల్లో నట్టించి అందరినీ అకట్టుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు రాలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు కోరుకునే వారికి ఇది తీపి కబురు. జ్యోతిక భర్త సూర్యతో కలిసి నటించేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం. అంజలి మీనన్ వీరిద్దరి కోసం లవ్ స్టోరీని రెడీ చేసిందట. వారి వయసుకు తగ్గ పాత్రల్లో వారిని చూపించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.
ఈ మధ్యే వరుసగా సినిమాలు చేస్తున్న జ్యోతిక తన భర్తతో కలిసి నటిస్తే చాలా బాగుంటుందని అభిమానులు అంటున్నారు. తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే అది తప్పకుండా హిట్ అవుతుందని అభిమానులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే వీరిద్దరూ వేరు వేరుగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాదిలో ఈ జంట కలిసి సినిమాలో యాక్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. బెంగళూరు డేస్ సినిమాతో దర్శకురాలిగా మారిన అంజలి మీనన్ ఈ సినిమా తీయనున్నారు. అయితే ఈ రియల్ జంటను రీల్ లో ఎంత చక్కగా చూపిస్తారో కొంచేం వేచి చూడాలి. పూర్తి వివరాల కోసం మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది.