NTR SKY: రేపు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో టీమ్ ఇండియా తొలి వన్డే ఆడనుంది. రేపు మధ్యాహ్నం మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే టీమిండియా ప్లేయర్స్ ఓ హోటల్ లోకి వెళ్లిన క్రమంలో అదే హోటల్ కి తారక్ కూడా వెళ్లారు. దీంతో ఎన్టీఆర్ వాళ్ళ అందరితో కాసేపు ముచ్చటించటం జరిగింది. అనంతరం ఫోటో కూడా దిగారు. అయితే ఎన్టీఆర్ తో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తన భార్యతో కలిసి స్పెషల్ ఫోటో దిగారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..”నిన్ను కలవటం చాలా ఆనందంగా ఉంది బ్రదర్! “RRR”కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినందుకు మరోసారి శుభాకాంక్షలు”….అని కామెంట్ పెట్టడం జరిగింది.
ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న ఇండియన్ టీంలో అతి తక్కువ కాలంలోనే సూర్య కుమార్ యాదవ్ అంతర్జాతీయంగా తనకంటూ రికార్డులు క్రియేట్ చేసుకున్నాడు. ఐసీసీ T20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టి20 టోర్నీలో ఏకంగా 112 పరుగులు చేయడం జరిగింది. అంతకుముందు కూడా బెస్ట్ ఎన్నిసార్లు వస్తున్నాడు. ప్రత్యర్థి వేసే ప్రతి బాల్ అన్ని రకాలుగా…360 డిగ్రీలలో కొట్టే సత్తా కలిగిన బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్నాడు. కాగా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ రేపటినుండి ప్రారంభం కాబోయే న్యూజిలాండ్ సిరీస్ లో ఏమి మేరకు రానిస్తాడో చూడాలి.
క్రికెట్ పరంగా సూర్య కుమార్ యాదవ్ మరోపక్క సినిమా పరంగా ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందడం జరిగింది. వీరిద్దరూ కలిసి స్పెషల్ గా ఫోటో దిగటం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారక్ మొన్నటి వరకు అమెరికాలో “RRR” సినిమా యూనిట్ తో సందడి చేశారు. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ రావడం జరిగింది. నెక్స్ట్ తన కెరియర్ లో 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. ఏప్రిల్ నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.