తెలుగు, తమిళ ప్రేక్షకులకకు సుపరిచితుడైన హీరో సూర్య ఇప్పుడు రెండు సినిమాలను తక్కువ గ్యాప్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ముందుగా సూర్య, సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న `ఎన్.జి.కె`(నందగోపాల కృష్ణ) జూన్లో విడుదలవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్స్. టీజర్ కూడా విడుదలైంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సూర్య డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ప్రస్తుత రాజకీయాలపై వ్యంగాస్త్రంగా ఈ సినిమాను సెల్వరాఘవన్ రూపొందించినట్లు సమాచారం.
దీంతో పాటు వీడొక్కడే, బ్రదర్స్ చిత్రాల దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో కాప్పాన్ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో మోహన్లాల్, ఆర్య, సయేషా సైగల్ భారీ తారాగణం ఉంది. ఈ సినిమాలో సూర్య ప్రధాని సెక్యూరిటీ ఆఫీసర్గా కనిపిస్తారు. ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!