తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. ఆయన 38వ చిత్రం సుధా కొంగర దర్శకత్వంలో రూపొందనుంది. తమిళ సంవత్సరాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సూరారై పోట్రు(శూరుణ్ణి కీర్తించు)’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఎయిర్ డెక్కన్ విమాన సంస్థ అధినేత కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్గా ఈ సినిమా తెరకెక్కనుంది. సూర్య ఈ చిత్రంలో నటిస్తూ నిర్మిస్తున్నారు. అపర్ణ బాల మురళి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. మోహన్బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సూర్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతోన్న `ఎన్.జి.కె` మే 31న విడుదల కానుంది. అలాగే సూర్యతో కె.వి.ఆనంద్ తెరకెక్కిస్తోన్న `కాప్పాన్` చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రం ఆగస్ట్లో విడుదలవుతుంది.
previous post
next post