బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి సిబిఐ ఆరు బృందాలుగా విడిపోయి విచారణ చేస్తుంది. ఆరు బృందాలు జరుపుతున్న విచారణలో బయట పడుతున్న విషయాలు సంచలనాలు రేపుతున్నాయి. మొదటినుండి కేసుకు సంబంధించి మహారాష్ట్ర మరియు బీహార్ పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల పోలీసులు జరిపిన విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలను ఆధారం చేసుకుని సిబిఐ సరికొత్త కేస్ ఫైల్ చేసి జరుపుతున్న విచారణలో ఏ ఒక్క కోణం లో ఎవరిని వదలటం లేదు.
ఇదిలా ఉండగా తాజాగా సుశాంత్ సింగ్ చనిపోయిన రోజు గదిలో వేసుకున్నా ఉరి…. సుశాంత్ సింగ్ హైట్ కి…. చనిపోయిన ఘటన స్థలానికి ఏమాత్రం పొంతన లేదని సిబిఐ గుర్తించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సూసైడ్ జరిగిన రోజు మహారాష్ట్ర పోలీసులు అత్యుత్సాహం చూపించినట్లు సిబిఐ గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం సిబిఐ సుశాంత్ చనిపోయిన సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం.
దీంతో సుశాంత్ ఉరివేసుకున్నడా లేదా అపస్మారక స్థితిలోకి జారుకున తర్వాత ఎవరైనా ఫ్యాన్ కి ఉరి వేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 14వ తారీకు జరిగిన ఈ ఘటన కి సంబంధించి…. ఆ రోజు ఏం జరిగింది ఎవరు ఏ విధంగా సుశాంత్ ని కలిశారు అన్ని విషయాలను, ఈ సందర్భంగా సీబీఐ ఆరా తీస్తుంది. మొత్తంమీద చూసుకుంటే సుశాంత్ ఉరివేసుకున్న సంఘటన స్థలంలో పోలీసులు డ్రామాలు ఆడినట్లు….. చనిపోయిన స్థలం లో డెడ్ బాడీకి, ఉరి వేసుకున్న ఘటనా స్థలానికి చాలా వ్యత్యాసం ఉన్నట్లు ముంబై పోలీసులు అత్యుత్సాహం చూపించినట్లు, సిబిఐ గుర్తించినట్లు వార్తలు తాజాగా వైరల్ అవుతున్నాయి.