బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో వెలుగులోకి వస్తున్న విషయాలు సంచలనాలు రేపుతున్నాయి. మూడు పదుల వయసులో పైగా బీభత్సమైన పాపులారిటీ, క్రేజ్ కలిగిన సుశాంత్ ఎలాంటి కారణం లేకుండా ఉరివేసుకొని చనిపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. మొదటిలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సుశాంత్ సింగ్ ఎదుగుదలను చూడలేక, అవకాశాలు ఇవ్వకుండా ఇండస్ట్రీలో ఉండే పెద్దలు అతని చావుకి కారణం అయ్యారు అంటూ నేపోటిజం అని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేరకు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పేరు తెరపైకి రావడంతో తాజాగా బయటపడుతున్న విషయాలు కేసుపై అందరికీ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇదే తరుణంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో… సిబిఐ బృందాలు 6 గా విడిపోయి…కేసుకు సంబంధించి ప్రతి కోణంలో, ప్రతి విషయాన్ని వెలికి తీస్తున్నారు. ఇటువంటి తరుణంలో సుశాంత్ సింగ్ గొంతు పిసికి కాదు విషం పెట్టి చంపేశారు అన్నట్టుగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేశారు.
పూర్తి విషయంలోకి వెళితే ప్రశాంతి చనిపోయిన కొన్ని గంటల తర్వాత పోస్టుమార్టం నిర్వహించారు అప్పటికే శరీరంలో విషయం జీవ రంధ్రాల ద్వారా పెరిగిపోయిందని సుబ్రహ్మణ్యస్వామి చెప్పుకొచ్చారు. ఈ విషయంలో సుశాంత్ ఇంట్లో పని వారిని అదేవిధంగా ఆయనతో సన్నిహితంగా ఉన్న వారిని ఎవరిని విడిచిపెట్టకుండా సిబిఐ ప్రశ్నించాలి సిందే అంటూ సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. మొదటిలో సుశాంత్ సింగ్ ని కుక్క బెల్ట్ తో ఆయన మెడకు ఉరి వేసి చంపేశారు అని, ఆ తర్వాత సూసైడ్ గా చిత్రీకరించారని పలు వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో లేదు విషం పెట్టి చంపేశారు అని సుబ్రహ్మణ్యస్వామి కామెంట్ చేయడం తో… ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.