బాలీవుడ్ స్టార్ డైరక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఎక్కువగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పేరు గట్టిగా వినబడుతోంది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన రియా చక్రవర్తి పేరు ఇటీవల సుశాంత్ రాజ్పుత్ పర్సనల్ ట్రైనర్ అహ్మద్ కూడా సుశాంత్ ఆత్మహత్య వెనకాల ఆమె కూడా ఉండి ఉండవచ్చు అనే రీతిలో హాస్టల్ మీడియా ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో కామెంట్ చేయడం జరిగింది. సుశాంత్ లైఫ్ లోకి ఎప్పుడైతే రియా చక్రవర్తి ఎంటర్ అయిందో అతనిలో చాలా మార్పు వచ్చినట్లు సుశాంత్ పర్సనల్ ట్రైనర్ అహ్మద్ చెప్పుకొచ్చాడు.
మరోపక్క సుశాంత్ తండ్రి కేకే సింగ్ తన కొడుకును రియా చక్రవర్తి దారుణంగా మోసం చేసిందని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని వెళ్లిపోయిందని…. అప్పట్లో సుశాంత్ సింగ్ ని కుటుంబంతో కూడా మాట్లాడి ఇచ్చేది కాదు. అలా దూరం చేసి తమ కొడుకు దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేయడంతో…ఫుల్లు డిప్రెషన్ లోకి వెళ్లిపోయి సుశాంత్ మరణించాడని తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. తన కొడుకును తన కుటుంబానికి దూరం చేసి మమల్ని అనాధగా చేసిందని మండిపడ్డారు. దీంతో వరుసపెట్టి తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బోరున ఏడ్చేసింది సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి.
అంతేకాకుండా తనపై వస్తున్న ఆరోపణలకు వీడియో రూపంలో మెసేజ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసి క్లారిటీ కూడా ఇచ్చింది. ఆ వీడియోలో రియా చక్రవర్తి మాట్లాడుతూ నిజం ఎప్పటికైనా గెలుస్తుందని తెలుపుతూ సందేశాన్ని ఇవ్వటంతో ఆమె తరపు లాయర్ శుక్రవారం దాన్ని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ”నాకు భగవంతుడిపై అదేవిధంగా న్యాయ స్థానాలపై నమ్మకం ఉంది. నాకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియాలో నా గురించి చాలా భయకరంగా ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఇది న్యాయపరమైన విషయం కాబట్టి నా లాయర్ సూచన మేరకు నేనేమీ మాట్లాడటం లేదు. సత్యమేవ జయతే. నిజం గెలుస్తుంది” అని వీడియోలో చెప్పుకొచ్చింది.