SVP: ‘ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఎల్లుండి రిలీజ్ కాబోతుంది కావున ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవలే పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. పెద్ద సినిమాలు విడుదల సమయంలో సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేయడం చాలా కామన్ విషయం. అయితే ఈ క్రమంలో ఈ సినిమా గురించి కూడా కొన్ని పుకార్లు మీడియాలో షికారు చేసి, ముఖ్యంగా మహేష్ అభిమానులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. దర్శకుడు పరశురామ్ ఈ సినిమా కథను మహేష్ బాబు కోసం కాకుండా అల్లు అర్జున్ కోసం మొదట రాసుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
SVP: క్లారిటీ ఇచ్చిన దర్శకుడు పరుశురాం:
ఇక పరుశురాం గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో చేసిన మొదటి సినిమా ‘గీత గోవిందం’ తరువాత వరుసగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో చేసిన పరశురామ్ ఈ కథను కూడా గీతా ఆర్ట్స్ లోనే చేయాల్సి వుంది. అయితే ఈ సినిమాని అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్నాడని, కాని బన్నీ మరియు అల్లు అరవింద్ లకు ఈ కాన్సెప్ట్ నచ్చలేదని అందుకే సినిమా పట్టాలెక్కలేదు అనే రూమర్స్ బయట వినపడే నేపథ్యంలో తాజాగా పరశురామ్ స్పందించాడు. గీత గోవిందం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న సమయంలోనే ఈ లైన్ ఐడియా వచ్చిందని, కాన్సెప్ట్ రెడీ చేసుకుని మహేష్ బాబు గారిని కలిసి చెప్తే అతను ఈ సినిమాని చేస్తానని అన్నారని క్లారిటీ ఇచ్చాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరింత సమాచారం:
ఇకపోతే మహేష్ బాబు నుండి అభిమానులు ఏమైతే ఆశిస్తారో తాను కూడా అంతగా మహేష్ బాబును అభిమానించి ఈ సినిమాను చేశాను అంటూ పరశురామ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా, మహేష్ బాబుకు పోకిరి మరియు దూకుడు ఎలా అయితే పక్క మాస్ కమర్షియల్ చిత్రాలుగా అలరించాయో అదే విధంగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను పరశురామ్ వ్యక్తం చేస్తున్నాడు. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటించిన విషయం తెల్సిందే.