మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్లతో నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 2న విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అన్నీ భాషల్లో రూ.100 కోట్లను దాటేసింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఓవర్సీస్లో ఈ చిత్రం 2 మిలియన్ డాలర్స్ మార్కును క్రాస్ చేసింది. చిరంజీవి చిత్రాల్లో రెండు మిలియన్ డాలర్స్ను క్రాస్ చేసిన రెండో చిత్రమిది. `ఖైదీ నంబర్ 150` తర్వాత `సైరా నరసింహారెడ్డి`తో చిరు ఈ ఘనతను సాధించారు.
previous post
next post