తెలుగు ప్రేక్షకులను ఒకపక్క ఐపీఎల్ మరోపక్క బిగ్ బాస్ సీజన్ 4 తెగ ఎంటర్టైన్ చేస్తున్నాయి. సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా వెళ్ళినా కరాటే కళ్యాణి రెండో వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మిరపకాయ్ సినిమాలో “బాబి పిండేసావు” అనే పాపులర్ డైలాగ్ తో ఆడియెన్స్ కి తెగ గుర్తుండిపోయింది. సుమారు 250 సినిమాల్లో నటించిన కరాటే కళ్యాణి మల్టీ టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. హౌస్ లో ముక్కుసూటి గేమ్ ఆడిన కరాటే కళ్యాణి ఇంటి సభ్యులన మెప్పించ లేకపోవడంతో పాటు ప్రేక్షకులను అంతగా అలరించలేకపోవడంతో, రెండో వారంలో ఓటింగులో వెనకబడి పోవడంతో ఎలిమినేట్ అయిపోయారు.
కాగా బయటకు వచ్చిన కరాటే కళ్యాణి పలు మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఓ వెబ్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సహజీవనం-పిల్లలు అనే టాపిక్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజ జీవితంలో పెళ్లి గురించి కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్ చేసింది. తన లైఫ్ లో ప్రేమ పెళ్లి ఏది కలిసిరాలేదని.. నిజమైన ప్రేమ తనకి లభించలేదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రేమ పేరుతో తనని కొంతమంది వాడుకున్నట్లు ఓపెన్ అయిపోయింది.
జీవితంలో తల్లి కావాలని బిడ్డను ఎత్తు కోవాలని తనకు ఎంతగానో ఆశ ఉందని…. రెండు సార్లు పెళ్లి చేసుకున్న ఆ ఆశతీర లేదని తెలిపిన కరాటే కళ్యాణి… సహజీవనం చేసిన పిల్లల్ని కనొచ్చాని తెలిపింది. అంతేకాకుండా తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మొదట్లో పిల్లలు కనేఁ దుకు కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత అలాంటివి రాలేదని, పూర్తి ఆరోగ్యంతో ప్రస్తుతం ఉన్నట్లు అన్ని పరీక్షలు చేయించుకున్నట్లు కరాటే కళ్యాణి స్పష్టంచేసింది.