మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు అందుకుంటున్నాయి. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ డేట్, వెన్యూ ఫిక్సయ్యింది. హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈవేడుకకి జనసేనాని పవన్కల్యాణ్, ఎస్.ఎస్.రాజమౌళి, కొరటాల శివ తదితరులు హాజరవుతారు. కేటీఆర్ హాజరవుతారని అనుకున్నారు కానీ.. చివరి నిమిషంలో ఆయన రాలేకపోతున్నానని చెప్పేశారట. అక్టోబర్ 2న సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
previous post