మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి` ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను భారీ రేంజ్లో విడుదల చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్యయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథతో రూపొందుతోన్న హిస్టారికల్ చిత్రమిది. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చాసుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా ప్రధాన తారాగణంగా నటించారు. రీసెంట్గా ముంబైలో జరిగిన ఈవెంట్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచడానికి ప్రమోషన్స్ను కొత్తగా ప్లాన్ చేశారు. సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగా నిర్వహిచబోతున్నారట. ఈ వేడుకకి పవన్ కల్యాణ్, ప్రభాస్ ముఖ్య అతిథులుగా వస్తారని వార్తలు వినపడుతున్నాయి.
previous post
next post