మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. ప్రథమస్వాతంత్య్ర సమరం కంటే ముందుగానే బ్రిటీష్ వారిని ఎదిరించిన ఓ యోధుడి కథ. చరిత్ర పుటల్లో కనుమరుగైన ఓ తెలుగువాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథే ఈ సినిమా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతుంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి.
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్, నయనతార, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చా సుదీప్, తమన్నా, నిహారిక తదితరులు నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. నాలుగు రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఏప్రిల్లో సీజీ వర్క్ సహా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను స్టార్ట్ చేస్తారట. సినిమాను దసరాకు విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి.
previous post
next post