మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత కథను ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న హిస్టారికల్ మూవీ ఇది. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్చరణ్ నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయబోతున్నారు. సినిమా ప్రమోషన్స్ను స్టార్ట్ చేశారు. సెప్టెంబర్లో ఆడియో వేడుకను నిర్వహించబోతున్నారు. సైరాలో కీలక పాత్రధారిగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్తో పాటు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని వార్తలు వినపడుతున్నాయి. ప్యాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమా ఆడియో వేడుకను ఎక్కడ చేయాలని చిత్ర యూనిట్ ఆలోచన చేస్తుందని టాక్. త్వరలోనే సైరా ఆడియో వేదికకు సంబంధించి ఓ క్లారిటీ రానుంది.
previous post
next post