మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి` షూటింగ్ దశలో ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్నఈ సినిమా ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని అనుకున్నారు కానీ.. తాజాగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ఇలా భారీ తారాగణంతో 200 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
previous post
next post