మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతుందని వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. డాన్శీను, బలుపు సినిమాల తర్వాత రవితేజ, గోపి కలయికలో తెరకెక్కబోయే సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో బలుపు హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా జాయిన్ అవుతుందని టాక్. అంతా హిట్ కాంబినేషన్ను నిర్మించబోయే నిర్మాత కూడా దొరికేశాడట. ఆయన ఎవరో కాదు… ఠాగూర్ మధు. రీసెంట్గా `కాంచన 3`తో నిర్మాతగా సక్సెస్ అందుకున్న ఠాగూర్ మధు, ఈ హిట్ కాంబోతో మరో హిట్ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.
previous post
next post