నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక చర్చలు జరుగుతున్నాయి.2016-17 సంవత్సరంలో అతడు సినిమాలలోకి వస్తాడని, అందుకు అన్ని సిద్ధమయ్యారని తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి బాలకృష్ణ కూడా తన కొడుకును వెండితెరకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. కానీ కొద్దిరోజుల తర్వాత మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఎలాంటి వార్త కూడా వినిపించలేదు.
ఇలాంటి తరుణంలో తనకు సినిమాలంటే ఆసక్తి లేదేమో అని మరి కొందరు భావించారు. మోక్షజ్ఞ వెండితెర పరిచయం గురించి అందరూ మరిచిపోయిన సమయంలో మళ్లీ తాజాగా తన సినిమా ఎంట్రీ గురించి ప్రస్తావన మొదలైంది. ఇన్ని రోజులు మోక్షజ్ఞ తన శరీరం ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టాడని, అందుకు తగ్గ కసరత్తులు చేస్తున్నాడని, ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కాబోతున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే నందమూరి వారసుడుని మొదటిసారిగా వెండితెరకు పరిచయం చేసే అవకాశం బాలకృష్ణతో “పైసా వసూల్” చేయించిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మోక్షజ్ఞ ను వెండితెరకు పరిచయం చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
మోక్షజ్ఞ కోసం పూరి ఓ పవర్ ఫుల్ కథను తయారు చేశాడని, ఆ కథను మోక్షజ్ఞతో తెరకెక్కించడానికి బాలకృష్ణ కూడా ఒప్పుకున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమాను బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ పదవ తేదీన మొదలుపెట్టే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారం ఎంతో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దీనిలో ఎంతవరకు నిజం ఉందనే విషయం గురించి నందమూరి అభిమానులలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం జోరుగా సాగుతున్న మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి నందమూరి కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఒకవేళ జూన్ 10న మోక్షజ్ఞ ను దర్శకుడు పూరి జగన్నాథ్ వెండితెరకు పరిచయం చేస్తే నిజంగానే ఇది నందమూరి అభిమానులకు మంచి కిక్ ఇచ్చే వార్త అని చెప్పవచ్చు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!