సూపర్స్టార్ మహేశ్ హీరోగా అనీల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని వార్తలు వినిపించాయి. రామోజీ ఫిలింసిటీలో ఓ భారీ సెట్ వేసి ఈ ఐటెమ్ సాంగ్ను చిత్రీకరిస్తారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ ఐటెమ్ సాంగ్ను ఇప్పుడు చిత్రీకరించాలనుకోవడం లేదని వార్తలు వినపడుతున్నాయి మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. మహేశ్ హీరోగా నటిస్తోన్న 26వ చిత్రమిది.
previous post
next post