RRR: టాలీవుడ్లో మరో కొత్త చరిత్ర సృష్ఠించిన లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్.టి.ఆర్లతో పాటు బాలీవుడ్ హాలీవుడ్ స్టార్ ఈ సినిమాలో నటించారు. గత నెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు బాలీవుడ్లో కొందరు విమర్శలు చేశారు. అయితే, వాటి ప్రభావం ఆర్ఆర్ఆర్ మూవీపై కాస్త కూడా పడలేదు. బాలీవుడ్ బెల్ట్లోనే దాదాపు రూ.130 కోట్ల వరకు వసూళ్ళు రాబట్టి ఆశ్చర్యపరిచింది.
అయితే, మొదటిసారి తెలుగులో ఓ సీనియర్ స్టార్ డైరెక్టర్ రాజమౌళిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా మారింది. ఆయనే దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన తెలుగు సినిమాలపై అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన పలు సమస్యలపై స్పందిస్తూ ఉంటారు. అందరి కంటే భిన్నంగా ఉండే ఆయన వ్యాఖ్యలు చాలా వరకు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భరద్వాజ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను గురించి మాట్లాడారు. ఈ సినిమా టిక్కెట్ల ధరలు పెంచడంతో పాటుగా.. కథను ఎంచుకున్న విషయంపై భరద్వాజ అసహనాన్ని.. అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
RRR: అనవసరంగా ఇద్దరు కథలను కలిపి తీశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో దమ్ములేదని తెలిసే ఇష్టమొచ్చిన రేటుకు అమ్మారు. మొదటి రోజు ఇంత రాబట్టిందని ప్రచారం చేసుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. కథ పరిధిని దాటి ఖర్చు చేయడం దాన్ని రాబట్టుకునేందుకు టికెట్ రేట్లు పెంచడంమనడం కరెక్ట్ కాదని అభిప్రాయ పడ్డారు. రాజమౌళి ఒక్క అల్లూరి సీతారామ రాజు కథ తీసినా, భీమ్ కథ తీసిన ఈ స్థాయిలోనే హిట్ అయ్యేది. కానీ, అనవసరంగా ఇద్దరు కథలను కలిపి తీశారు. ఇక రాజమౌళి ఒక్క ఫ్రేమ్ కూడా వృధా చేయనని చెప్పారు. మరి ఇంత బడ్జెట్ ఎందుకు అయింది.. అంటూ పలు ఆసక్తి కరమైన విషయాలను ప్రస్తావించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!