త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మూడో సినిమాలో తాను రియంట్రీ ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని హీరో తరుణ్ క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు 28వ సినిమాలో తాను నటించడం లేదని తెలిపారు. తన జీవితంలో ఏదైనా జరిగితే తానే స్వయంగా చెబుతానని స్పష్టం చేశారు. “SSMB 28” లో తరుణ్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ తాజాగా తాను నటించడం లేదని తరుణ్ చెప్పడంతో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో చాలామంది ఒకప్పటి హీరోల చేత కీలకమైన పాత్రలు పోషిస్తూ ఉన్నారు. ఉపేంద్ర, సుశాంత్… వీళ్లంతా ఇటీవల త్రివిక్రమ్ సినిమాలలో కనిపించడం జరిగింది. ఆ తరహాలోనే తరుణ్ కు.. త్రివిక్రమ్ ఆఫర్ ఇచ్చినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఇదంతా పక్కన పెడితే “SSMB 28” సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 8వ తారీఖు నుండి స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవటంతో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. సరిగ్గా ఇదే తేదీ నాడు 2006వ సంవత్సరంలో మహేష్ కెరియర్ లో “పోకిరి” విడుదల అయింది. “పోకిరి” ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తేదీకి త్రివిక్రమ్ తన మూడో సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది.