Aacharya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే సాగర చంద్ర దర్శకత్వంలో నటించిన “బీమ్లా నాయక్” బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం రానాతో కలిసి పవన్ నటించిన ఈ సినిమాకి డైలాగులు త్రివిక్రమ్ రాయటంతో ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 29వ తారీకు చిరంజీవి, చరణ్ కలిసి నటించిన “ఆచార్య” విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి.. ఇటీవల హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ సమయంలో ట్రైలర్ రిలీజ్ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విడుదలైన “ఆచార్య” ట్రైలర్ కి ప్రత్యేక రెస్పాన్స్ రాలేదు. దీంతో ఇప్పుడు “భీమ్ల నాయక్” తరహాలోనే… ఆచార్య సినిమా యూనిట్ రెండో ట్రైలర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పవన్ “బీమ్లా నాయక్” ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన మొదటి ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఫ్రీ రిలీజ్ వేడుక టైంలో.. అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ మరో ట్రైలర్ విడుదల చేశారు దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పుడు ఇదే తరహాలో “ఆచార్య” సినిమా యూనిట్… ఏప్రిల్ 29.. కొద్ది రోజుల ముందు మరో ట్రైలర్ రిలీజ్ చేయాలని… భావిస్తున్నట్టు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పైగా సినిమాల్లో చరణ్ 40 నిమిషాల పాత్ర పోషించిన ఈ క్రమంలో చిరంజీవి- చరణ్ నీ ఓకే ఫ్రేమ్ లో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఒక్క పరాజయం లేని డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో “ఆచార్య” గ్యారెంటీ హీట్ అని అంటున్నారు.