Ram Charantej: ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన T20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలవటం తెలిసిందే. దీంతో క్రికెట్ అభిమానులు భారత్ విజయం పట్ల పండగ చేసుకున్నారు. చాలా కాలం తర్వాత హైదరాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ కి భారీ ఎత్తున ప్రేక్షకులు వచ్చారు. స్టేడియం మొత్తం నిండిపోయింది. చివరి ఓవర్ దాకా నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్, కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ కనబరిచారు. ఇక చివరి ఓవర్ లో హార్దిక్ పాండ్యా చాలా కాన్ఫిడెంట్ గా గేమ్ ఆడటంతో ఇంకొక్క బంతి మిగిలి ఉండగానే మ్యాచ్ గెలవడం జరిగింది.
అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం హైదరాబాద్ రామ్ చరణ్ ఇంటికి ఇండియన్ టీంకి చెందిన కొంతమంది ప్లేయర్స్ వెళ్లినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు, కథనాలు వైరల్ అవుతున్నాయి. చరణ్ నీ కలవటానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మరి కొంతమంది ఆటగాళ్లు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి.
దీంతో తమ అభిమాన హీరోని స్టార్ క్రికెటర్స్ కలిశారని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. దాదాపు అర్ధరాత్రి మొదలుకొని తెల్లవారి వరకు వీళ్లంతా చరణ్ ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. “RRR”లో చరణ్ నటించిన రామరాజు పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇటువంటి క్రమంలో చరన్ ని ఇండియన్ టీం మెంబెర్స్ కలిసినట్లు వార్త రావటం సంచలనంగా మారింది.