మెగా క్యాంప్ హీరో సాయితేజ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ ఏడాది `చిత్రలహరి`తో సక్సెస్ అందుకున్న ఈ యువ కథానాయకుడు ఇప్పుడు మారుతి దర్శకత్వంలో `ప్రతిరోజూ పండగే` అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత తేజు సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తాడని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తేజు, దేవకట్టా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని సమాచారం. భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం దేవ కట్టా హిందీ `ప్రస్థానం`తో బిజీగా ఉన్నారు. ఇది పూర్తి కాగానే తేజు సినిమా వర్క్ ప్రారంభమవుతుంది.
previous post
next post