తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు హీరోయిన్ గా సక్సస్ సాధించడం చాలా తక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో ఇప్పుడున్న ఈ మోడ్రన్ కల్చర్ లో ఏ చిత్ర పరిశ్రమలో అయినా హీరోయిన్ అంటే ముంబై నుండో లేక ఢిల్లీ నుంచో దిగుమతి అవ్వాల్సిందే తప్ప పక్కనే ఉన్న తెలుగమ్మాయిలను ఎంకరేజ్ చేయరు. ఈ విషయంలో చాలామంది తెలుగమ్మాయిలు వాపోతుంటారు కూడా. అయిన మన మేకర్స్ కి ముంబై మోడల్సే కావాలి. ఇందులో వాళ్ళ కుండే లెక్కలు వాళ్ళకున్నాయి.
అయితే ఎక్కడో ఈషా రెబ్బ లాంటి తెలుగమ్మాయిలు వచ్చి కిందా మీదా పడి సక్సస్ సాధించి నెమ్మదిగా బండి లాగిస్తున్నారు. “అంతకు ముందు ఆ తర్వాత” సినిమాతో టాలీవుడ్ కి ఎంటరైన ఈషా రెబ్బ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికి వరసగా అవకాశాలను దక్కించుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్..మంచి ఫిజిక్ ఉన్నా అవకాశాలు దొరకడం లేదు. త్రివిక్రం ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత.. వీరరాఘవ’లో అవకాశం వచ్చినా.. ఆ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆ సినిమా ఉపయోగపడలేదు.
దాంతో ఒకడుగు ముందుకు వేసి టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ను అట్రాక్ట్ చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగానే కియారాకే పోటీగా నిలవబోతుందట. హిందీలో ‘లస్ట్ స్టోరీస్’ మాదిరిగా తెలుగులో కూడా ‘లవ్ స్టోరీస్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. హిందీలో నలుగురు దర్శకులు ‘లస్ట్ స్టోరీస్’ పేరుతో ఒక అడల్ట్ వెబ్ సిరీస్ తీశారు. అందులో కియారా అద్వానీ హాట్ సీన్లో నటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. చెప్పాలంటే ఈ ‘లస్ట్ స్టోరీస్’ లో నటించాకే బాలీవుడ్ లో కియారా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. వరసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ టాలీవుడ్ వైపు చూడనంత బిజీగా ఉంది.
ఇప్పుడు తెలుగులో లవ్ స్టోరీస్ పేరుతో అలాంటి ప్రయోగమే చేస్తున్నారు. ఈ సిరీస్ లో ఇషా రెబ్బ నటించనుంది. ఘాజి ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వం లో వస్తోంది. ఇందులో ఈషా కియారాకి మించి పాపులర్ కావాలని కసిగా ఉందట. ఎలాంటి బోల్డ్ సీన్ అయినా నో చెప్పకుండా మొహమాట పడకుండా చేస్తానంటుందట. మొత్తానికి ఈషా కియారాని టాలీవుడ్ కి రాకుండా తొక్కే ప్రయత్నమేదో చేయాలనే ప్లాన్ లో ఉందని చెప్పుకుంటున్నారు.