SIIMA 2022: గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా దక్షిణాది సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా జరిపే సైమా అవార్డుల వేడుక ఆడియన్స్ మధ్య జరగలేదు. కానీ ప్రస్తుతం దేశంలో వైరస్ ప్రభావం తక్కువగా ఉండటంతో ఈ ఏడాది సైమా2022 అవార్డుల వేడుక బెంగళూరు వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది సినిమా రంగంలో పేరుగాంచిన ఈ ఏడాది సైమా అవార్డులలో.. తెలుగు సినిమాలు పుష్ప, అఖండ, ఉప్పెన, జాతీరత్నాలు వివిధ కేటగిరీలలో పోటీపడ్డాయి.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు అల్లు అర్జున్ నటించిన “పుష్ప” అత్యధికంగా ఏకంగా 12 కేటగిరీలలో పోటీలో ఉండటం జరిగింది. బెంగళూరు గార్డెన్ సిటీలో జరుగుతున్న సైమా 2022 వేడుకలకు సంబంధించి.. టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు దక్షిణాది రంగానికి చెందిన పలు ఇండస్ట్రీలకు చెందిన హీరోలు కూడా హాజరయ్యారు.
టాలీవుడ్ నుండి ఫస్ట్ డే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, డైరెక్టర్ సుకుమార్, హీరో నవీన్ పోలిశెట్టి, సుధీర్ బాబు, డిజె టిల్లు ఫెమ్ సిద్దు, ఆలీ, ప్రగ్యా జైస్వాల్, హరీష్ శంకర్ మరి కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు హాజరయ్యారు. ఈ ఏడాది సైమా పురస్కారాలకు సంబంధించి పది సంవత్సరాలు కావస్తున్న క్రమంలో…”సైమా 2022″ అవార్డుల వేడుక చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. పైన చెప్పిన తెలుగు తారలు.. మొదటి రోజే వీళ్లంతా హాజరు కావడం జరిగింది. సెప్టెంబర్ 10 ఇంకా 11 తారీఖులో జరుగుతున్న సైమా అవార్డుల ప్రధానోత్సవంలో.. మొదటిరోజు అల్లు అర్జున్ నటించిన “పుష్ప”కి భారీ ఎత్తున అవార్డులు వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత బాలయ్య బాబు నటించిన “అఖండ”కి కూడా భారీగానే సైమా అవార్డులు గెలుచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.