నేడు తెలుగు చలనచిత్ర సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే జగన్ టాలీవుడ్ లో జరిగే సినిమా షూటింగ్ లకు ఆంధ్రప్రదేశ్ లోని ఉన్న ప్రభుత్వ భూముల ఉచితమే అని…. ఎటువంటి రుసుము చెల్లించకుండా షూటింగ్ చేసుకోవచ్చని ప్రకటించిన విషయం తెలిసిందే.
దానికి కృతజ్ఞతగా మరియు లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్ లు జరుపుకునేందుకు పర్మిషన్ ఇంకా ఇక్కడి నుండి ఆర్టిస్టులను హైదరాబాద్ పిలిపించుకునేందుకు అనుమతి కోసం ఇండస్ట్రీ నుండి ప్రముఖులు జగన్ ను కలిశారు.
సినీ హీరో చిరంజీవి మట్లాడుతూ ఏడాది కాలంగా జగన్ ను ఇలా కలవాలని అనుకున్నాం కుదరలేదు అని చివరికి ఈ రోజు కలిశాం అన్నారు. కరోనా కారణంగా షూటింగ్ లేక ఇబ్బంది పడ్డ తమకు ఇక్కడా జగన్ గారు అనుమతి ఇచ్చారు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే థియేటర్ ల పై మినిమం ఫిక్స్డ్ ఛార్జ్ లు ఎత్తివేయాలని కోరాం అని దాన్ని కూడా పరిశీలిస్తాం ఆయన అన్నారని అన్నాడు.
నంది వేడుకలు పెండింగ్ ఉండగా…. ప్రభుత్వం నుంచి తాము ప్రోత్సాహం కోరుకుంతున్నట్లు…. 2019-20 కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నాం అని అన్నారు. ఇదిలా ఉండా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను వెన్నంటే ఉంటానని సీఎం చెప్పడం తమకు ఆనందం కలిగించింది అని చెప్పిన మెగాస్టార్ వైజాగ్ లో స్టూడియో కి వైఎస్సార్ ఇచ్చిన భూమిని ఉపయోగించుకొని దానిలో పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం అని అన్నారు.
పైన ఉన్న ఫోటోలో మనం మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, ఎస్.ఎస్.రాజమౌళి డి.సురేష్ బాబు వంటి ప్రముఖులతో జగన్ తో ముచ్చటించడం చూడవచ్చు. ఇకపోతే ఈరోజు హైదరాబాద్ నుండి అమరావతికి తరలిపోయిన ఇండస్ట్రీ వారు ఉన్న గెస్ట్ హౌస్ ముంది అమరావతి రైతులు చేయడం ధర్నా చేయడం జరిగింది.
తమ భూముల విషయంలో తమకు న్యాయం జరిగేలా సినిమా వారు జగన్ తో మాట్లాడాలి అని వారు నినాదాలు చేశారు. అయితే కొద్దిసేపటికే పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ఇక ఈ మీటింగ్ కు నందమూరి బాలకృష్ణకు ఆహ్వానం లభించగా రేపు ఆయన పుట్టినరోజు ఉన్నందున ఆ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నందువల్ల రాలేకపోయారు.