Thaman: మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ప్రస్తుతం తెలుగులో భారీ చిత్రాలకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇలా దాదాపు అందరి సినిమాలకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఆయా చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ మేకర్స్ కంటే ముందు థమన్ ఇచ్చేస్తున్నాడు. ఇది అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది. అయితే తాజాగా ఇచ్చిన అప్డేట్తో మాత్రం అందరినీ కన్ఫ్యూజన్లో పడేశాడు.
ఈ అప్డేట్ ఏ హీరో సినిమాకి సంబంధించినదో అర్థం కాక ఆయా హీరోల అభిమానులు బుర్రలు బాదుకుంటున్నారు. ముఖ్యంగా మహేశ్ అభిమానులకు మెంటలెక్కిపోతుందట. మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా సర్కారు వారి పాట సినిమా రుపొందుతోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మహేశ్ సొంత నిర్మాణ సంస్థ అయిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ప్లస్ కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏవీ ఈ మధ్య రాలేదు. సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించి ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
Thaman: సర్కారు వారి పాట అప్డేట్స్ ఇవ్వడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
అందుకే సర్కారు వారి పాట అప్డేట్స్ ఇవ్వడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ దర్శకుడు థమన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫిబ్రవరి 14 అని మ్యూజిక్ నోట్ సింబల్ను పెట్టాడు. అంటే ఆ రోజు ఓ సాంగ్ను రిలీజ్ చేయబోతున్నామని అర్థం. కానీ, అది ఏ సినిమాకు సంబంధించినది అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో మహేశ్ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులకు..మిగతా హీరోల అభిమానులకు పజిల్ పెట్టినట్టైంది. చూడాలి మరి థమన్ ఇచ్చిన ఈ అప్డేట్ ఏ సినిమాకు సంబంధించినదో.
#FEB14th 🎵♥️
— thaman S (@MusicThaman) January 20, 2022