Thaman: థమన్ ఇచ్చిన ఈ అప్డేట్ చాలు మహేశ్ ఫ్యాన్స్ రచ్చ మొదలుపెట్టడానికి.. అవును ఇన్ని రోజులు సరైన అప్డేట్ లేక ఏం చేయాలో అని మహేశ్ బాబు అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికి ఎలాంటి అప్డేట్ ఇవ్వాలో అదే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఇప్పటికే దుబాయ్, గోవా, హైదరాబాద్లలో మెజారిటీ భాగం చిత్రీకరణను పూర్తి చేసేశారు.
ఇక మిగిలింది మహేశ్ పాల్గొనాల్సిన కొన్నీ సీన్స్ మాత్రమే షూటింగ్ చేయాలి. అలాగే రెండు పాటలను తెరకెక్కించాల్సి ఉందని సమాచారం. అయితే, ప్రస్తుతం మహేశ్ కరోనా బారిన పడటంతో పాటు తన అన్నయ్య రమేశ్ బాబు మృతితో మానసికంగా ఒత్తిడిలో ఉన్నారు. అందుకే కాస్త సమయం పడుతుందని అంటున్నారు. ఫిబ్రవరికి గనక మహేశ్ పూర్తిగా అన్నిటి నుంచి కోలుకుంటే బ్యాలెన్స్ షూటింగ్ మొదలుపెట్టి ఫినిష్ చేస్తారని అనుకున్నట్టుగానే ఏప్రిల్ 1వ తేదీన సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. కానీ, ఇంకా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్డేట్స్ మాత్రం మొదలవలేదు.
Thaman: థమన్ వినిపించిన ఫస్ట్ సింగిల్ ట్యూన్ అదిరిపోయింది.
ఈ విషయంలో చాలా డిసప్పాయింట్ అవుతున్న మహేశ్ అభిమానులకు థమన్ సర్కారు వారి పాట సినిమా నుంచి టైటిల్ సాంగ్ ట్యూన్ను సోషల్ మీడియా ద్వారా వినిపించి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ట్యూన్ ఇంతక ముందు వచ్చిన ఫస్ట్ గ్లింస్ మాదిరిగా ఉంది. అది బాగా పాపులర్ అయింది. ఇప్పటికే ఆ బీజీఎం ని కొంతమంది
అభిమానులు మొబైల్ రింగ్ టోన్గాను పెట్టుకున్నారు. ఇక తాజాగా థమన్ వినిపించిన ఫస్ట్ సింగిల్ ట్యూన్ అదిరిపోయింది. అంతేకాదు త్వరలో సర్కారు వారి పాట నుంచి మొదటి పాట వచ్చేస్తుందని థమన్ దాదాపు హింట్ ఇచ్చేశాడు. బహుషా మరో మూడు రోజుల్లో అంటే జనవరి 26న విడుదలవుతుందేమో చూడాలి.