Naga Chaitanya: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ విధంగా ప్రతిరోజు కేసుల సంఖ్య పెరగటంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేశారు. ఈ క్రమంలోనే పలు సినిమా షూటింగ్ లు సైతం పక్కనపెట్టి ఇంట్లో కూర్చున్నారు. కానీ కొందరు హీరోలు మాత్రం కరోనా నిబంధనలను, జాగ్రత్తలను పాటిస్తూ అతి కొంతమంది సభ్యుల సమక్షంలో సినిమా షూటింగ్ లను నిర్వహిస్తున్నారు.
తెలుగు సినిమా రంగంలో దాదాపు చివరి దశలో ఉన్న షూటింగులు కొంతమంది చిత్ర బృందం సభ్యుల మధ్యన కరోనా జాగ్రత్తలను పాటిస్తూ షూటింగ్ నిర్వహిస్తున్నారు. మరికొందరు ఇతర దేశాలకు వెళ్లి చిత్రీకరణ జరుపుతున్నారు.తాజాగా అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న “థాంక్యూ” చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ఇటీవల కాలంలో వైజాగ్ లో పూర్తి చేసుకుంది. తరువాత షెడ్యూల్ కోసం చిత్రబృందం విదేశాలకు పయనమైంది.
ఇటలీలో థాంక్యూ చిత్ర బృందం:
ఈ సినిమాలో ఓ కీలకమైన షెడ్యూల్ షూటింగ్ నిమిత్తం చిత్రబృందం ఇటలీలో వాలిపోయింది. ఇటలీలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చిత్ర నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్న పీసీ శ్రీరామ్ లొకేషన్స్ స్టిల్స్ తన ట్విట్టర్లో షేర్ ఇంత భయంకరమైన పరిస్థితులలో కూడా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ నిర్వహిస్తున్నామంటూ పేర్కొన్నాడు. పదిహేను రోజుల పాటు ఇటలీలో జరిగే ఈ షెడ్యూల్ లో హీరోయిన్ రాశి కన్నా కూడా పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి ఈ సినిమాకి స్టోరీ అందించడంతో పాటు డైలాగ్స్ కూడా రాస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాకు ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించనున్నారు. ఇదివరకే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి, నాగచైతన్య జంటగా నటించిన “లవ్ స్టోరీ” సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!