SVP: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ – మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకాబోతోంది. ఇంతకుముందే ట్రైలర్ విడుదలై యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. లవ్, రొమాన్స్, యాక్షన్ ప్యాక్డ్ కలగలసిన సినిమా అని ఆ ట్రైలర్ చూసిన ఎవరికన్నా ఇట్టే అర్ధం అయిపోతుంది. అయితే ఈ ట్రైలర్ లో భాగంగా వినపడింది ”నేనున్నాను.. నేను విన్నాను” అనే డైలాగ్ గురించి ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ డైలాగ్ ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి కాపీ చేసారని చాలామందికి తెలిసినా… ఆ డైలాగ్ మహేశ్ బాబుపై, దర్శకుడు పరశురాంపై వైఎస్ జగన్ ప్రభావం తప్ప వేరొక కారణం ఏదీ లేదని కొట్టి పారేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దానికేనా ఆ డైలాగ్ మంత్రం?
ఇక ఇదే విషయమై AP రాష్ట్రానికి చెందిన పలువురు MLAలు, మంత్రులు కూడా చర్చించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజమేనా? అని పరశురామ్ నే అడిగితే.. అతడు చెప్పిన ఆన్సర్ ఇదట… దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డిపై ఉన్న ప్రేమ కారణంగానే ఈ డైలాగ్ ఉంచినట్లు స్పష్టం చేశారట. తాను YS రాజశేఖర్ రెడ్డికి ఫాలోవర్ ని అని, ఆయన చెప్పిన డైలాగ్ ని నిజంగా ఇష్టపడ్డానని దర్శకుడు పరశురామ్ తాజాగా ఓ మీడియా వేదికగా వెల్లడించాడు. దాంతో మహేష్ – కీర్తి మధ్య ఓ సన్నివేశంలో దానిని ఉపయోగించాలనే ఉపయోగించానని తెలిపారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దానికి ఆ డైలాగ్ అవసరం అట!
సినిమాలో భాగంగా ఆ సన్నివేశంలో హీరో గారు.. హీరోయిన్ కీర్తికి ఓ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఈ డైలాగ్ రాస్తే బాగా పేలుతుందని అనిపించి పెట్టారట. ఇక అసలు సంగతి పెరుమాళ్ళకెరుకగాని, ఆ డైలాగ్ విని YSR పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం ఫుల్ ఖుషిలో వున్నారు. అయితే ఈ క్రమంలో సదరు చిత్ర యూనిట్ పైన కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ను మెప్పించడానికే ఆ డైలాగులు రాసారని అనేవారు లేకపోలేదు. ఇక కొంతమందైతే ఒక సినిమా వాడు ప్రభుత్వాన్ని మెప్పించే దుస్థితికి దిగజారిపోయాడంటూ అనుకుంటున్నారు.