మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉన్నారు. కరోనా తీసుకొచ్చిన గ్యాప్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూడ్చాలాన్ని డిసైడ్ అయ్యారు. దీంతో ఈ ఏడాది ఆల్రెడీ “ఆచార్య” విడుదల చేసిన చిరంజీవి త్వరలో “గాడ్ ఫాదర్” సినిమాతో ఆడియన్స్ ని అలరించనున్నారు. విజయదశమి పండుగ నేపథ్యంలో “గాడ్ ఫాదర్” రిలీజ్ కానుంది. మరొక ఇదే సమయంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో “బోలా శంకర్” సినిమా స్టార్ట్ చేయడం తెలిసిందే. అయితే ఒక పక్క “గాడ్ ఫాదర్” మరొక “బోలా శంకర్” షూటింగ్ లలో బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవల డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కూడా సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
ఇటీవల సినిమాకి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వచ్చే సంక్రాంతి పండుగకు వస్తున్నట్లు.. ముందే విడుదల తేదీ ప్రకటించేశారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు హీరో రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జులై 14 వ తారీకు నుండి రవితేజ షూటింగ్ లో జాయిన్ కావడం జరిగిందట. ముందుగా రవితేజ పాత్రకి సంబంధించి సన్నివేశాలు డైరెక్టర్ బాబీ షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకమైన సెట్ లో.. రవితేజ రావటం జరిగిందంట. “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ పెట్టడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా కోసం దాదాపు 30 నుండి 40 రోజులపాటు రవితేజ కాల్ షీట్స్ ఇవ్వడం జరిగిందంట. రవితేజ సరసన ఈ సినిమాలో కేథరిన్ నటిస్తుండగా ఒక బాబుకి తండ్రిగా రవితేజ పెద్ద తరహా పాత్ర చేస్తున్నట్లు సమాచారం.
గతంలో చిరంజీవితో “అన్నయ్య” సినిమాలో చిరుకి రవితేజ తమ్ముడు పాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత “శంకర్ దాదా జిందాబాద్” లో ఒక పాటలో రవితేజ చిన్న గెస్ట్ రోల్ పాత్ర చేయడం జరిగింది. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాలో రవితేజ నటించడం విశేషం. దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో.. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని ముందుగానే రవితేజ సన్నివేశాలు చిత్రీకరించాలని డైరెక్టర్ బాబీ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ టాక్. దీంతో గురువారం నుండి “చిరు 154” షూట్ లో రవితేజ జాయిన్ కావడం జరిగిందట. దాదాపు ఏకధాటిగా రెండు వారాలపాటు రవితేజ.. ఈ సినిమా షూటింగ్ లో వర్క్ చేయనున్నట్లు సమాచారం.