NTR30: “RRR” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్.. కొరటాలతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్లో ఇది 30వ సినిమా కావడంతో… తారక్ ప్రతి విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. పైగా గతంలో రాజమౌళి తో చేసిన తర్వాత సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అవుతుండటంతో… ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా పరాజయం కాకుండా తారక్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే తారక్ పుట్టిన రోజు నేపథ్యంలో.. ఎన్టీఆర్ కొరటాల ప్రాజెక్ట్ కి సంబంధించి ఎన్టీఆర్ చెప్పిన డైలాగులతో కూడిన చిన్న పాటి వీడియో.. రిలీజ్ కావడం తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో సినిమా స్టోరీ పై బయట రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. ఎక్కువగా జరుగుతున్నట్లు డిస్కషన్ చూస్తే ఇది విశాఖపట్టణం నేపథ్యంలో సినిమా స్టోరీ అని అంటున్నారు. కాలుష్యాన్ని ప్రధానాంశంగా తీసుకుని విశాఖపట్టణం లో లాక్ డౌన్ సమయంలో..విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదం ఘటనకు సంబంధించిన కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తాజా వీడియో బట్టి బయట జనాలు.. భావిస్తున్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదం ఘటన లో అర్ధరాత్రి.. పరిశ్రమ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు మరియు పశువులు అదే రీతిలో చెట్లు కూడా దెబ్బతినటం కొంత మంది మరణించడం పశువులు చనిపోవడం తెలిసిందే.
అప్పుడే దేశంలో కరోనా రావడం.. దేశం మొత్తం లాక్ డౌన్ కావటంతో… ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హుటాహుటిన cm వైఎస్ జగన్ వైజాగ్ కి వచ్చి పరిస్థితిని.. పరిశీలించి బాధితులకు కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించడం మాత్రమే కాదు ఫ్యాక్టరీ పై చర్యలు కూడా తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో చేయబోయే కొరటాల ప్రాజెక్ట్ కాలుష్యానికి సంబంధించి అని.. విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తాజా వీడియో బట్టి.. చాలా మంది భావిస్తున్నారు.