Chiranjeevi: దాదాపు మూడు దశాబ్దాల కాలం పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనాన్ని శాసించిన చిరంజీవి.. ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగి అశేష జన వాహిని అభిమానం సంపాదించి.. ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు తెలుగు చలనచిత్ర సినిమా ఇవ్వటం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ చిరంజీవి సొంతం. కొద్ది సంవత్సరాల క్రితం ఎంతో ప్రభావితం చేసే వ్యక్తిగా మొన్న చిరంజీవి రాజకీయాల్లో అడుగుపెట్టి కొద్దిగా డౌన్ అయ్యారు అని చెప్పవచ్చు. టాప్ మోస్ట్ హీరోగా మాత్రమే కాదు తన క్రేజ్ పెరిగేకొద్ది చిరంజీవి అనేక మంచి కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ వచ్చారు.
అంతేకాదు ఇండస్ట్రీ నమ్ముకుని కష్టాల్లో ఉన్నవారికి కూడా చిరంజీవి తనవంతుగా లేక కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికీ కూడా అండగా ఉంటూ ఉన్నారు. ఈ రీతిగానే బ్లడ్ బ్యాంక్ స్థాపించడం జరిగింది. ఈ బ్లడ్ బ్యాంక్ తో చిరంజీవి చాలామంది ప్రాణాలను కాపాడటం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ బ్లడ్ బ్యాంక్ నందు ఓ కార్యక్రమంలో నిర్వహించి దానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళసై నీ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తన అభిమానుల ప్రేమ నలుగురికి పంచాలన్న ఉద్దేశంతోనే బ్లడ్ బ్యాంక్ నెలకొల్పినట్లు స్పష్టం చేశారు. 1998లో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారు. ఆ ఘటనలో నన్ను ఎంతగానో భాదించాయి. అందుకే బ్లడ్ బ్యాంక్ స్థాపించా.. బ్లడ్ బ్యాంకు ద్వారా 70 శాతం రక్తం పేదలకు ఉచితంగా అందించాం. ఇప్పటిదాకా 9.30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించటం జరిగింది. 50 సార్ల కంటే ఎక్కువ రక్తదానం చేసిన వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులు ఇస్తున్నాం అని చిరంజీవి స్పష్టం చేశారు.