వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “వకీల్ సాబ్” సినిమాతో పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటంతో దాదాపు రెండు సంవత్సరాలపాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన నేపథ్యంలో ప్రస్తుతం వరుస సినిమాలతో మెగా అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. దీనిలో భాగంగా “వకీల్ సాబ్” సినిమా అతి తక్కువ టైమ్ లో కంప్లీట్ చేయగా మిగతా ఒప్పుకున్న సినిమాలని అదే స్పీడులో పూర్తి చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ – పవన్ తిరుగులేని కాంబినేషన్ గా తిరుగులేని క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో ఇప్పటికే మూడు సినిమాలు కూడా రావడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయడానికి రెడీ అయినట్లు సరికొత్త టాక్ వస్తోంది. పూర్తి విషయంలోకి వెళితే ఇది రాజకీయ నేపథ్యంలో సాగే సినిమా అని ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.
అంత మాత్రమే కాక మళయాళం చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్లో సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే బాధ్యత త్రివిక్రమ్ తీసుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా కలసి ఈ సినిమా చేస్తున్న తరుణంలో.. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని త్రివిక్రమ్ రంగంలోకి దిగినట్లు ఇండస్ట్రీలో టాక్.